తురక కాశి కుటుంబాలకు డబుల్ బెడ్ రూములు మంజూరు చేయండి - ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ డిమాండ్

తురక కాశి కుటుంబాలకు డబుల్ బెడ్ రూములు మంజూరు చేయండి - ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ డిమాండ్

ముద్ర,ఎల్లారెడ్డిపేట : తురక కాశి కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ లో మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామానికి చెందిన  20 కుటుంబాలు వర్షాలకు ఇబ్బంది పడుతున్నట్టు శుక్రవారం మండల కాంగ్రెస్ కమిటీ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ  గత 20 సంవత్సరాలుగా తురక కాశి కుటుంబాల వారు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని అన్నారు.  కూలి పని చేసుకుంటూ  బండ రాళ్లను కొడుతూ జీవనం కొనసాగిస్తున్న వీరి గుడిసెలలో వర్షాలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు  పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ను ఎన్నోసార్లు కలవడానికి ప్రయత్నించిన స్థానిక నాయకులు తమను కలవనీయడం లేదని బాధితులు తెలిపారన్నారు. డబుల్ బెడ్ రూములు ఇస్తామని ఎన్నోసార్లు ఆశ చూపి తమకి ఇంతవరకు డబుల్ బెడ్  రూములు  కేటాయించడం లేదన్నారు. ఇండ్లలోకి పాములు తేళ్లు వస్తున్నాయని చిన్న పిల్లలను జాగ్రత్తగా కాపాడలేక ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. బాధితులను పరామర్శించిన వారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం  గౌడ్,  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షులు అనవేని రవి, నాయకులు  చెన్ని బాబు, గంట బుచ్చ గౌడ్, రామ్ రెడ్డి, కొత్తపల్లి దేవయ్య ,బానోతు రాజు నాయక్ ,భాను  తదితరులు పాల్గొన్నారు.