జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి -ఎస్పీ అఖిల్ మహాజన్ 

జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి -ఎస్పీ అఖిల్ మహాజన్ 

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : మహాత్మా జ్యోతిరావుపూలే నవతరానికి ఆదర్శప్రాయుడని వారి ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జ్యోతిరావుపూలే  చిత్ర పటానికి ఎస్పీ అఖిల్ మహాజన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగాఎస్పీ అఖిల్ మహాజన్  మాట్లాడుతూ దేశం గర్వించే గొప్ప మహానీయుల్లో పూలే . ఒక్కరిని,అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త పూలే అని అన్నారు .సామాజిక న్యాయం,ధ్యేయం పేరుతో ఉద్యమాలు నడిపి తనవంతుగా సహకరించేవారనీ,స్త్రీల విద్య అవసరాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించారన్నారని,సమాజంలో సగభాగంగా ఉన్న స్ర్తీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని భావించిన ఫూలే ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు .1948 లో బాలికల కొరకు పాఠశాలను స్థాపించి,ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడమే కాకుండా తన భార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేసిన మహోన్నత వ్యక్తి పూలే అని,రానున్న తరాలకు పూలే, సావిత్రి బాయిల జీవితం స్ఫూర్తినిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది,పాల్గొన్నారు.