స్వశక్తి సంఘాలకు చెక్కులు అందజేత

స్వశక్తి సంఘాలకు చెక్కులు అందజేత

ముద్ర బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో మహిళ మండలి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి,మహిళలందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, గ్రామానికి చెందిన 24 స్వశక్తి సంఘాలకు గురువారం రోజున  7,75,368 రూపాయల విఎల్ఆర్ ప్రొసీడింగ్ కాపీలను మహిళ సభ్యులకు అందజేయడం జరిగింది.
గ్రామ సర్పంచ్ బూరుగుల నందయ్య మాట్లాడుతూ: ప్రతి మహిళ ఒక పారిశ్రామిక వేత్తగా ఎదగాలన్న ముఖ్యమంత్రి కలను నెరవేర్చాలని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమములో పంచాయితీ కార్యదర్శి షబానాసుల్తానా, విఏఏ భాగ్యలక్ష్మి, మహిళ సంఘ లీడర్లు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు