ఘనంగా కుంకుమార్చన - శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో 

ఘనంగా కుంకుమార్చన - శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో 

ముద్ర,ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా  ఎల్లారెడ్డి పేట మండల కేంద్రము లో  కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని ఎల్లారెడ్డిపేట మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించారు.ఈ సందర్భంగా గురువారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కి 200 మంది మహిళలు పారాయణం కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు.స్థాపిత  దేవతాహ్వన పూజ హవనం , రుద్ర  , పంచ , సూక్త , దేవి సూక్త హావనములు ప్రసాద సంస్కారం , మూలమంత్ర హావనం దాన్యాదివాస, పుష్ప దివాస ఫలాదివాస షేయ్యాదివాసములు పూజ శ్రీ శుకానందనాథ దీక్షా నామాంకితులు బ్రహ్మశ్రీ రఘురాం శర్మ , బ్రహ్మశ్రీ రాచర్ల హన్మండ్ల  శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఆలయన్ని సందర్శించిన జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణ్ రావు, సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరస కృష్ణ హరి, ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రతినిధులు బుచ్చయ్య,ప్రభాకర్, బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారు బాల్ రెడ్డి , బిజెపి ప్రధాన కార్యదర్శి సందుపట్ల లక్ష్మారెడ్డి ,పారి పెళ్లి రామ్ రెడ్డి లను ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు గుండా చిన్న మల్లేశం, బొమ్మ కంటి  రాజయ్య , దుబ్బా విశ్వనాథం ,గంపనాగేంద్రం , బొమ్మ కంటి రాజేశం , బొమ్మ కంటీ శ్రీ నివాస్ లు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు