ఎల్లారెడ్డిపేట గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
![ఎల్లారెడ్డిపేట గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_640ff23d6a957.jpg)
ముద్ర,ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సోమవారం రాత్రి మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. మహాత్మా గాంధీ కుడిచేయిని విరగొట్టి పారిపోయారు. ఆ మహనీయుని విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుచున్నారు. కాగా అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పేర్కొన్నారు.భారత స్వతంత్రం వచ్చిన కొత్తలో పద్మశాలీలు మహాత్మా గాంధీని సొంత ఖర్చులతో నిర్మాణం చేశారు. నాటి నుండి నేటి వరకు గణతంత్ర దినోత్సవాలకు పెయింటింగులు వేసి మూడు రంగుల జెండాతో అందంగా తీర్చిదిద్దుతారు.