డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు భూమి పూజలు

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు భూమి పూజలు
bhoomi pooja

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్, సింగారం గ్రామంలో శనివారం రథసప్తమి సందర్భంగా ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పిటిసి లక్ష్మణరావు కలిసి డబుల్ బెడ్ రూమ్ మంజూరైన ఇండ్లకుభూమి పూజ చేశారు.ముఖ్య అతిథులుగా  బిఆరెస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పాల్గొని తిమ్మాపూర్ లో 30 ఇండ్లు,సింగారంలో 20 ఇండ్లు మంజూరైనటువంటి వాటికి భూమి పూజ చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కో ఆప్షన్ సభ్యులు చాంద్ పాషా, గ్రామ సర్పంచులు, సింగిల్ విండో అధ్యక్షులు  గుండారం కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందే సుభాష్ తదితరులు పాల్గొన్నారు.