సీఈఐఆర్ పోర్టల్ లో వివరాలు నమోదుచేసుకోవాలి.. -ఏస్ఐ రాజేష్..
![సీఈఐఆర్ పోర్టల్ లో వివరాలు నమోదుచేసుకోవాలి.. -ఏస్ఐ రాజేష్..](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_6505645f7026b.jpg)
ముద్ర,రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బింగి గణేష్ రమాదేవి తన బట్టల దుకాణంలో ఫోన్ ను పొడగొట్టుకుని రుద్రంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రుద్రoగి పోలీసులు ఫోనును గుర్తించి బాధితునికి అందజేశారు. బాధితుడు తన 30000 రూపాయల ఫోన్ ను అప్పగించినందుకు పోలీస్ శాఖ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితులు సరైన సమయంలో పోలీస్ స్టేషన్ నందు సీఈఐఆర్ పోర్టల్ లో వివరాలు నమోదు చేస్తే తిరిగి పొందే అవకాశం ఉందని తెలిపారు. ఫిర్యాదు చేసిన నెల రోజుల లోపు ఫోన్ ను వెతికి పట్టుకొని బాధితులకు అప్పగిస్తామన్నారు.
ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.