తెలంగాణ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఎవరో తేల్చండి

నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్శిటీలో కొనసాగుతున్న వివాదం. రిజిస్ట్రార్గా చెరొకరిని పాలకమండలి, వీసీ నియమించారు. రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ యాదగిరి బాధ్యతలు చేపట్టారు. మూడు రోజుల కిందట కనకయ్యను రిజిస్ట్రార్గా వీసీ రవీందర్ నియమించారు. పాలకమండలి, వీసీ తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వీసీ రవీందర్ గుప్తా దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. ఎవరు అసలు రిజిస్ట్రారో తేల్చాలని విద్యార్థులు పట్టబడుతున్నారు. ఇద్దరు రిజిస్ట్రార్లతో విద్యార్థి సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు.