వెల్గటూర్ లో కోరం లేక వాయిదా పడ్డ మండల సర్వసభ్య సమావేశం..

వెల్గటూర్ లో కోరం లేక వాయిదా పడ్డ మండల సర్వసభ్య సమావేశం..

వెల్గటూర్, ముద్ర : వవెల్గటూర్ మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరుగాల్సిన మండల సర్వసభ్య సమావేశం  కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీఓ  సంజీవ రావు తెలిపారు. కాగా ఈ సమావేశానికి కొత్తపేట, పాత గూడూర్, ముత్తునూర్ సర్పంచులు  కొమ్ము రాంబాబు, జగదీశ్వర్ రెడ్డి, అనుమాల తిరుపతిలు మాత్రమే పాల్గొన్నారు. మండలంలో గల ఎంపీటీసీలు  ఒక్కరు కూడా సమావేశానికి హాజరు కాలేదు.  దీనితో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు  ఎంపీడీవో తెలిపారు.