వెల్గటూర్ లో కోరం లేక వాయిదా పడ్డ మండల సర్వసభ్య సమావేశం..
![వెల్గటూర్ లో కోరం లేక వాయిదా పడ్డ మండల సర్వసభ్య సమావేశం..](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_650564ef16c18.jpg)
వెల్గటూర్, ముద్ర : వవెల్గటూర్ మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరుగాల్సిన మండల సర్వసభ్య సమావేశం కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీఓ సంజీవ రావు తెలిపారు. కాగా ఈ సమావేశానికి కొత్తపేట, పాత గూడూర్, ముత్తునూర్ సర్పంచులు కొమ్ము రాంబాబు, జగదీశ్వర్ రెడ్డి, అనుమాల తిరుపతిలు మాత్రమే పాల్గొన్నారు. మండలంలో గల ఎంపీటీసీలు ఒక్కరు కూడా సమావేశానికి హాజరు కాలేదు. దీనితో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు.