మండల కేంద్రంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్ ని ఏర్పాటు చేయాలి

మండల కేంద్రంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్ ని ఏర్పాటు చేయాలి
  • సిపిఎం పార్టీ విజ్ఞప్తి

ముద్ర, బోయినిపల్లి;రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్ ని ఏర్పాటు చేయాలని వినియోగదారుల తరఫున సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.గురజాల శ్రీధర్ మాట్లాడుతూ: బోయినిపల్లి మండలం చుట్టూ 23 గ్రామాలు అనుసంధానం చేసుకొని ఇక్కడ మండల కేంద్రంలో స్టేట్ బ్యాంకు బ్రాంచ్ లేకపోవడం వల్ల వినియోగదారులు ఖాతాదారులు,అలాగే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఎక్కడో మూలకు విలాసాగర్ గ్రామంలో ఉండడం వల్ల ఈ వైపు ఉన్న గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి,మరి బ్యాంకు అధికారులు కూడా ఆ దిశగా స్పందించి,మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తే ఇక్కడున్న గ్రామాల ప్రజలకు సేవలు అందుబాటులోకి వస్తాయి. వినియోగదారుల, ఖాతాదారుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత వరకు, త్వరలో ఇక్కడ స్టేట్ బ్యాంకు బ్రాంచ్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రజల తరఫున సిపిఎం పార్టీ మండల శాఖ తరపున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, అలువల అంజయ్య, ఒంటెల రెడ్డి, రాజయ్య, నరసయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.