చేపలు వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు..
![చేపలు వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు..](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_650be1a61516f.jpg)
ముద్ర,గంభీరావుపేట:చెరువు లో చేపలు పట్టడానికి వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతైన సంఘటన గంభీరావుపేట మండలం నాగం పేట గ్రామంలో చోటు చేసుకుంది. నాగం పేట గ్రామానికి చెందిన బొంది రాజయ్య గ్రామం సమీపంలోని చెరువు లోకి బుధవారం రాత్రి చేపలు పట్టడానికి వలలు చెరువులో వేసి, గురువారం ఉదయం తిరిగి తీసుకోవడానికి చెరువులోకీ దిగడంతో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు మునిగి గల్లంతయ్యాడు. విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు, పోలీస్ లు చెరువు వద్దకు చేరుకుని గజ ఈతగాళ్లు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.