బలగం సినిమా నటుడి కీసరి నర్సింగంతకు సిరిసిల్ల జడ్పీ చైర్ పర్సన్ పరామర్శ

బలగం సినిమా నటుడి కీసరి నర్సింగంతకు సిరిసిల్ల జడ్పీ చైర్ పర్సన్ పరామర్శ

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం నాగారం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న బలగం సినిమాలో సర్పంచ్ పాత్ర పోశించిన కేసరి నర్సింగంను రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పరామర్శించారు. కీసరి నర్సింగం గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నాడు.

జడ్పీచైర్ పర్సన్ వెంట బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, జిల్లా సర్పంచుల ఫోరం కార్యదర్శి మంతెన సంతోష్, పాక్స్ చైర్మన్లు బండ నర్సయ్య, సంకినేని రాంమోహన్ రావు, సర్పంచులు బాసం లావణ్య శ్రీను, జిన్నా అనిల్, ఎంపీటీసీ చారి, నాయకులు రవి, జీవన్ గౌడ్, రమణ రెడీ, రాజు, తదితరులు ఉన్నారు.