ఎల్లారెడ్డిపేట లో నట్టల నివారణ మందుల పంపిణీ 

ఎల్లారెడ్డిపేట లో నట్టల నివారణ మందుల పంపిణీ 

ముద్ర,ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా  ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లో  గొర్రె  మేకల  నట్టల నివారణ కో‌సం  సోమవారం  ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, వెటర్నరీ డాక్టర్ రేణుక , ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ లు కలిసి  పంపిణీ చేశారు. వెటర్నరీ డాక్టర్ రేణుక  మాట్లాడుతూ మండలంలో యాదవ సోదరులు  ‌ మొత్తం 45  వేల గొర్రె మేకలును పెంచుకుంటున్నారని ఇప్పటి వరకు మండలంలోని బొప్పాపూర్ , గొల్లపల్లి గ్రామాలు మినహా  అన్ని గ్రామాల్లో 32 వేల గొర్రె మేకల  కు నట్టల నివారణ కో‌సం మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ   పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ,మండల యాదవ సంఘం అధ్యక్షులు మెండే శ్రీ నివాస్ యాదవ్,  బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పందిర్ల పర్షరాములు,  గౌడ్ ,బొల్లు  భూమయ్య యాదవ్,  పశువైద్య సిబ్బంది సుజాత, చిన్నోజీ, గొర్రె మేకల పెంపకం దారులు వట్టెల రాజు , పెద్ద వేణి సతీశ్  తదితరులు పాల్గొన్నారు.