బాధిత కుటుంబానికి బియ్యం వితరణ - ఎల్లారెడ్డిపేట పవర్ యూత్ ఔదార్యం

బాధిత కుటుంబానికి బియ్యం వితరణ - ఎల్లారెడ్డిపేట పవర్ యూత్ ఔదార్యం

ముద్ర,ఎల్లారెడ్డిపేట:గీతా కార్మికుడు గంట దుర్గయ్య  గత వారం కారు ప్రమాదంలో మరణించాడు. మృతుని కుటుంబం కేసీఆర్ కాలనీలో నివసిస్తుండగా వారి ఇంటికి గురువారం ఎల్లారెడ్డిపేట పవర్ యూత్ సభ్యులు వెళ్లి పరామర్శించి మనోధైర్యాన్ని కల్పిస్తూ  50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నరేష్, భాస్కర్,రాఘవేంద్ర, కళ్యాణ్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.