ఎమ్మెల్యే  పైళ్ళ శేఖర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు...

ఎమ్మెల్యే  పైళ్ళ శేఖర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు...

ముద్ర ప్రతినిధి భువనగిరి: ఎమ్మెల్యే  పైళ్ళ శేఖర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరారు. గురువారంభువనగిరి పట్టణంలో ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయంలో భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామానికి చెందిన 30 మంది యువకులు కాంగ్రెస్, బిజెపి పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  మంచి  పథకాలకు, ఎమ్మెల్యే చేస్తున్న మంచి పనులకు ఆకర్షితులై  బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, మాజీ ఎంపీపీ కేశపట్నం రమేష్, ర్యాకల శ్రీనివాస్ పాల్గొన్నారు.