అభివృద్ధి  పనులను చూసి పైళ్ల శేఖర్ రెడ్డిని గెలిపించాలి..

  • 19, 20, 22 వార్డులలో మన్వితారెడ్డి ప్రచారం

ముద్ర ప్రతినిధి భువనగిరి :ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి  పనులను చూసి, పనులు చేసే నాయకునికి ఓటు వేయాలని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి , పైళ్ల శేఖర్ రెడ్డి ని గెలిపించాలని ఆయన కూతురు పైళ్ళ మన్వితారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని 19, 20, 22వ వార్డులలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డి గెలుపుకై ఇంటింటి ప్రచారం   నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధిని, చూసి ఓటేయాలని, ఏ విధంగా మన నియోజకవర్గ అభివృద్ధిని, పట్టణ అభివృద్ధి, గమనించాలని ఏళ్ల తరబడి లో లేని అభివృద్ధి మంత్రి కేసీఆర్ అయిన తర్వాతనే ,తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, వచ్చే ఎన్నికలలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ కి అధికారం ఇవ్వాలని, మళ్లీ భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి అయిన పైళ్ల శేఖర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటరుకు ఆమె  విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి , బి ఆర్ ఎస్ నాయకులు గోమారి సుధాకర్ రెడ్డి, ఇట్టబోయిన గోపాల్, తాడూరు బిక్షపతి, రత్నపురం పద్మ, సహదేవ్, రహీం, గుండెబోయిన సురేష్, నీలం రమేష్, తాడేం రాజశేఖర్, ఇండ్ల శీను, కాంచనపల్లి నర్సింగరావు, జలీల్, సూరజ్ పాల్గొన్నారు.

నాగిరెడ్డిపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన పైళ్ల వనిత రెడ్డి

భువనగిరి బిఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి పైళ్ల వనితారెడ్డి భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  గ్రామంలో మహిళలు, ఓటర్లు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.