ఎబివిపి పాఠశాలల బంద్ విజయవంతం

ఎబివిపి పాఠశాలల బంద్ విజయవంతం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: విద్యారంగ సమస్యలపై ఎబివిపి ఇచ్చిన విద్యాసంస్థల బంద్ విజయవంతం అయింది. మెజారిటీ విద్యాసంస్థలు  ముందుగానే సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై రెండు వారాలు పూర్తయినా ఇప్పటివరకు విద్యార్థులకు, దుస్తులు రాలేదని ఎబివిపి నేతలు ఆరోపించారు. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు, నోటు పుస్తకాలు, అక్రమంగా, అధిక ధరలకు విక్రయిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించు కోవడంలేదని వారు ఆరోపించారు. ఇక ప్రైవేట్ విద్యాసంస్థలు లక్షల్లో ఫీజులు దండుకుంటున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ బంద్ కార్యక్రమంలో ఏబీవీపీ ఇందూరు విభాగం కన్వీనర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.