గుండెపోటుతో బిఆర్ఎస్ కార్యకర్త మృతి
![గుండెపోటుతో బిఆర్ఎస్ కార్యకర్త మృతి](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_64298e3957ae7.jpg)
నివాళులు అర్పించిన నాయకులు
ముద్ర ప్రతినిధి, వనపర్తి : వై శాఖాపూర్ గ్రామంలో గుండెపోటుతో బిఆర్ఎస్ కార్యకర్త విష్ణు నాయుడు (35) మృతి చెందారు, ఇతనికి భార్య సంధ్య, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. వ్యవసాయ శాఖా మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వనం రాములు యాదవ్, శ్రీరంగాపూర్ సింగిల్ విండో చైర్మన్ జగన్నాథం నాయుడు, పెద్దింటి వెంకటేష్, సర్పంచ్ మేకల రవి కుమార్ యాదవ్, తోమాలపల్లే మధు, పెబ్బేరు సింగిల్ విండో వైస్ చైర్మన్ జక్కుల ఆంజనేయులు, విష్ణు నాయుడు కు నివాళులు అర్పించారు, అయన కుటుంబాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి అన్ని విధాల ఆదుకుంటామని అన్నారని తెలిపారు, మంత్రి రెండు రోజుల తర్వాత కుటుంబాన్ని పరామర్శిస్తారని, విష్ణు కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ప్రార్థిస్తూ విష్ణు నాయుడు కుటుంబానికి మంత్రి అండగా ఉంటారని తెలిపారు.
వీరివెంట పాతపల్లి గోవింద్ నాయుడు, మరటి రామకృష్ణ నాయుడు, ఆంజనేయులు సాగర్, పరమేష్ నాయి, మన్యం నాయుడు, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పగడాల కృష్ణ నాయుడు, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించారు.