ఇచ్చిన హామీలు నెరవేర్చాలి - సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి.  

ఇచ్చిన హామీలు నెరవేర్చాలి - సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి.  


ముద్ర,ఎల్లారెడ్డిపేట : ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని గురువారం సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు.ఈ మేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలానికి 30 పడకల ఆసుపత్రి,ప్రభుత్వ డిగ్రీ కళాశాల  మంజూరు చేస్తానని ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. సిరిసిల్లలో మహిళా డిగ్రీ కళాశాల మంజూరు ఏమైందని ప్రశ్నించారు. రాజరాజేశ్వర జలాశయం నుండి తొమ్మిదవ ప్యాకేజీ కింద మల్కపేట రిజర్వాయర్ నుండి ఎగువ మానేరుకు ఇప్పటివరకు సాగునీరు  అందించలేదన్నారు. హామీలు ఇవ్వడం తప్ప ప్రజలకు ఇప్పటివరకు కోరికలు నెరవేర్చలేదన్నారు. ప్రతిపక్ష పార్టీగా నాయకులు అడిగిన లేదా వాళ్ల పార్టీకి చెందిన బిఆర్ఎస్  పార్టీ నాయకులు అడిగిన కస్సుబుస్సు అనడం తప్ప నిజాయితీగా పనిచేయడం లేదని ఆరోపించారు. ఇట్టి విషయాలను నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవడం జరుగుతుందని,ఈ ప్రాంత బిడ్డవు కాదు కాబట్టే  ఇక్కడ ప్రేమతో పనులు చేయడం లేదన్నారు.సిరిసిల్ల నియోజకవర్గంలో ఇప్పటికీ కనీసం ఒక ఫ్యాక్టరీని తెచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తావ్ అనుకుంటే ఐటి మినిస్టర్ గా ఉండి కూడా లాభం లేదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,చెన్ని బాబు, గంటబుచ్చా గౌడ్  పాల్గొన్నారు.