ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం
  • పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో

ముద్ర, ఎల్లారెడ్డిపేట :ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డును అందుకున్న దొడ్ల సంజీవ్ ను పద్మశాలి సేవా సంఘం వారు ఘనంగా సన్మానించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన దొడ్ల సంజీవ్ ఇటీవల గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డును అందుకోగా సోమవారం ఎల్లారెడ్డిపేట పద్మశాలి సేవా సంఘం వారు స్థానిక మార్కండేయ ఆలయంలో సంజీవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ తమ కుల బాంధవుడైన  సంజీవ్ కు ఉత్తమ ఉపాధ్యాయినిగా అవార్డు రావడం చాలా సంతోషమని అన్నారు. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే అవకాశం ఒక్క ఉపాధ్యాయునికి మాత్రమే ఉందని అలాంటి వారిని సన్మానించడం శుభపరిణామమని కొనియాడారు.  ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వనం బొందయ్య తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.