ముదిరాజుల పోరాట ఫలితమే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ..

ముదిరాజుల పోరాట ఫలితమే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ..
  • ఐక్యత చాటిన ముదిరాజులకు ఉద్యమ అభినందనలు
  • భవిష్యత్తులో కూడా ముదిరాజులు ఇదే ఉద్యమస్ఫూర్తిని కొనసాగించాలి
  • తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్శ హన్మాండ్లు

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల :ముదిరాజుల పోరాట ఫలితమే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పారని,భవిష్యత్తులో కూడా ముదిరాజులు ఇదే ఉద్యమస్ఫూర్తిని కొనసాగించాలనీ తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్శ హన్మాండ్లు అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని బీసీ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో  పర్శ హన్మాండ్లు  మాట్లాడుతూ ముదిరాజ్ సామజిక వర్గం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డిని  క్షమాపణ చెప్పాలని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమలు చేపట్టడం జరిగిందనీ  అన్నారు. ముదిరాజుల పోరాట ఫలితమే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ  అని,  ముదిరాజు లు నిరసన కార్యక్రమాలతో హోరెత్తించడంతో వారి ఒత్తిడికి తలొగ్గి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పారని అన్నారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పేవరకు, ఐక్యత చాటిన ముదిరాజులకు ఉద్యమ అభినందనలు చెప్పారు.పాడి కౌశిక్ రెడ్డి చెప్పిన క్షమాపణ యావత్ తెలంగాణ 60 లక్షల మంది ముదిరాజుల విజయంగా భావిస్తున్నామని తెలిపారు.భవిష్యత్తులో కూడా ఇదేవిధంగా ముదిరాజులు ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు.