మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు - అడిషనల్ ఎస్పీ చంద్రయ్య

మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు - అడిషనల్ ఎస్పీ చంద్రయ్య

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : సమాజంలో మహిళలకు గొప్ప స్థానం ఉందని, వారిని గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని, మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు అని  అడిషనల్  ఎస్పీ చంద్రయ్య  అన్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎస్పీ అఖిల్ మహాజన్    ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యక్రమంలో,,పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో  మహిళా సిబ్బందిని శాలువా కప్పి , ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మహిళల ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం  అడిషనల్ ఎస్పీ చంద్రయ్య  మాట్లాడుతూశక్తిసామర్ధ్యాలలో, అభివృద్ధిలో నిర్ణయాలలో ఆదర్శవంతగా కీర్తించబడే, స్త్రీమూర్తి వంటింటికే పరిమితం కాకుండా, మేటి విలువలతో విభిన్న రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం అహర్నిశలూ కృషిచేస్తూ,మేలైన విజయాలను సొంతం చేసుకుంటున్నారు. నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు కుమారస్వామి, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు ,మహిళ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.