కల్వకుంట్ల కుటుంబాన్ని తరమాలి.. సిరిసిల్ల చౌరస్తాలో పాతిపెట్టాలి

కల్వకుంట్ల కుటుంబాన్ని తరమాలి.. సిరిసిల్ల చౌరస్తాలో పాతిపెట్టాలి
  • వందల కోట్లు ఎట్లోచ్చినయ్.. గెస్ట్ హౌస్ లు ఎట్లోచ్చినయ్
  • సిరిసిల్ల బహిరంగ సభలో టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: తెలంగాణా నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొట్టాలని, సిరిసిల్ల చౌరస్తాలో పాతిపెట్టాలని టీపీసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రాజన్నసిరిసిల్ల జిల్లాలో హత్ సే జోడో యాత్ర చేరుకుంది. సిరిసిల్ల పాతబస్టాండ్ లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో రేవంత్రెడ్డి మాట్లాడారు. పోలీసులు, టీఆర్ఎస్ నేతలు ఎన్ని అడ్డంకులు చేపట్టిన వేలాది మంది ఈ సమావేశానికి తరలివచ్చి విజయవంతం చేశారని రేవంత్ పేర్కొన్నారు. ప్రభుత్వ అరాచకాలను తరిమికొట్టేందుకు అభినందనలు తెలిపారు. తెలంగాణ ఉద్యమం కోసం పదవీ త్యాగం చేసిన నేతన్న బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. 2001లో కొండా లక్ష్మణ్ బాపూజీ కేసీఆర్ కు పార్టీ ఆఫీసు ఇచ్చి ఆశీర్వదించారన్నారు. అలాంటి వ్యక్తి చివరి చూపులకు కూడా వెళ్లని దుర్మార్గుడు, నీచుడు కేసీఆర్ అని రేవంత్రెడ్డి విమర్శించారు.2001 నుంచి 2009 వరకు కేసీఆర్ కు సేవలందించిన కేకే మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వని దుర్మార్గుడు కేసీఆర్ అన్నారు. ఆమెరికాలో ఉన్న కేటీఆర్ను తెచ్చుకొని ఎమ్మెల్యే చేశాడన్నారు. సాధించిన తెలంగాణను కాలనాగు లాంటి కల్వకుంట్ల కుటుంబం కాటేస్తోందన్నారు.

15ఏళ్లుగా ఎంత కష్టమొచ్చినా, ఆస్తులు పోగొట్టుకున్నా కేకే మీకు తోడుగా ఉంటున్నరని పేర్కొన్నారు. కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ పిచ్చి కుక్కలా మారి కరుస్తున్నారని విమర్శించారు. అలాంటి కుక్కను తరిమి తరిమి రాళ్లతో కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేటీఆర్ ఇసుక దోపిడీకి, ధన దాహానికి దళిత బిడ్డ అడ్డుకుంటే.. వారిపై దాడులు చేయించడన్నారు.ఓట్లేసిన సిరిసిల్ల ప్రజలను పోలీసుల బూట్లకింద కేటీఆర్ నలిపేస్తున్నాడన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఆమోదించిన మీరాకుమారి ని అవమానించిన దుర్మార్గుడు కేసీఆర్ అని తెలిపారు. కరీంనగర్ ఎంపి బండి సంజయ్ ఎస్సీ కమిషన్ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదని, నేరెళ్ల బాధితులకు ఎందుకు న్యాయం చేయడం లేదని రేవంత్ ప్రశ్నించారు. బండి సంజయ్ ఎవరికి లొంగిపోయాడని రేవంత్ ప్రశ్నించారు.నివేదికను బయటపెట్టి దళితులపై దాడిచేసిన వారిని ఎందుకు శిక్షించడంలేదన్నారు.ఎప్పటిలోగా దళితులపై దాడులు చేసిన వారిని శిక్షిస్తారో బండి సంజయ్ చెప్పాలన్నారు. నేరెళ్ల దళితులపై థర్డ్ డిగ్రి ప్రయోగించిన అధికారికి హైదరాబాద్ లో వందల కోట్లు సంపాదించుకునే పోస్టింగ్ లు ఇచ్చి పక్కనపెట్టుకున్నారని ఆరోపించారు.

కూలీ డబ్బులు తప్ప ప్రభుత్వం తమకు చేసిందేం లేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం సిరిసిల్ల నేతన్నలను ఎందుకు అదుకోవడంలేదన్నారు. ఈ సిరిసిల్లకు పట్టిన కొరివి దయ్యాన్ని వదిలించాలని,కేటీఆర్ తెలంగాణ కుటుంబ సభ్యుడు కాదు.. దండుపాళ్యం ముఠా సభ్యుడు మాత్రమే అని పేర్కొన్నారు. పోలీసుల పహారా మధ్య ప్రగతి భవన్... పాకిస్తాన్ ఇండియా బార్డర్ ను తలపిస్తోందన్నారు. అమరుల కుటుంబాలను ప్రగతి భవన్ కు పిలిచి బుక్కెడు బువ్వ పెట్టలేదన్నారు. అలాంటి వాడికి తెలంగాణ కుటుంబం ఎట్లా అయితవ్ అని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేరలకు తరమాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులంతా ఆస్తులు పోగొట్టుకుంటే.. కేటీఆర్ కు ఇన్ని కోట్ల ఆస్తులేలా వచ్చాయన్నారు.పేద బిడ్డలు ప్రగతి భవన్ కు వచ్చేలా ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టలాన్నారు. చింతమడక నుంచి వచ్చిన కేటీఆర్ ఎప్పటికీ మీ బిడ్డ కాదని, నాలుగు కోట్ల ప్రజలం మనం.. నలుగురు వాళ్లు... అని కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించారు. నమ్మితే ప్రాణాలు ఇచ్చే వాళ్లం మనం..  నమ్మితే గొంతు కోసే రకాలు కేసీఆర్ కుటుంబం అన్నారు. అలాంటి వారిని తెలంగాణ పొలిమేరలదాకా తరమాలని, సిరిసిల్ల చౌరస్తాలో పాతి పెట్టాలన్నారు.