కస్తూర్బా గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం

కస్తూర్బా గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం
  • బయటకు పరుగులు తీసిన విద్యార్థులు
  • విద్యార్థులకు ప్రాణాపాయం జరగలేదు 

ముద్ర,ఎల్లారెడ్డిపేట: కస్తూర్బా గురుకుల పాఠశాలలో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలో శుక్రవారం  సాయంత్రం కస్తూర్బా గురుకుల పాఠశాలలో అకస్మాత్తుగా సంపు మోటర్కు ఉన్న షార్ట్టర్ కనెక్షన్ బాక్సు పేలడంతో  భారీ శబ్దం వచ్చి  ఒక్కసారిగా విద్యుత్తుకు అంతరాయం ఏర్పడిందని తెలిసింది. పాఠశాలలో ఉన్న విద్యార్థులు శబ్దానికి భయపడి బయటకు పరుగులు తీయడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు.  ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.