దళారులు రాజ్యమేలుతున్నారు

దళారులు రాజ్యమేలుతున్నారు
  • మాఫియాను అరికట్టండి
  • సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి

ముద్ర, ఎల్లారెడ్దిపేట : బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో దళారులు రాజ్యమేలుతున్నారని మాపియను అరికట్టి సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని కిష్టం పల్లి గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ అండ చూసుకొని సిరిసిల్ల నియోజకవర్గంలో భూ దందాలు, అక్రమ ఇసుక రవాణ, మైనింగ్ రంగాలలో ప్రథమ స్థానంలో నిలిచారన్నారు .ఈ వ్యవహారంలో పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం విడ్డూరమన్నారు.పేద ప్రజల బ్రతుకులు మారడానికి ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వంలో మండలానికి 5గురు చొప్పున బడా నాయకులు బాగుపడ్డారు తప్ప పేదలను బాగుపరచలేదని ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికలలో తాను మద్యం పంచ, డబ్బులు పంచనని మంత్రి కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. తాను ఓడిపోతే పథకాలు ఏమైతాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వం పడిపోతే తర్వాత ప్రభుత్వం ఇంకా మెరుగైన పథకాలు అందించడం జరుగుతుందని అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం లో స్థానికుడైన నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిపించాలని కోరారు. పదిమంది గ్రామస్తులు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షులు అనవేని రవి ,మండల మైనార్టీ అధ్యక్షులు ఎండి రఫీక్ , నాయకులు మొగుళ్ల మధు ,గంట దేవయ్య,పయ్యావుల దేవయ్య, చెన్ని బాబు, గంట బుచ్చ గౌడ్, పందిర్ల శ్రీనివాస్, సంతోష్ గౌడ్ ,తిరుపతి గౌడ్, మామిండ్ల కిషన్, తిరుపతిరెడ్డి ,భూక్య గణపతి, కటికే రవి, సిరిసిల్ల సురేష్ , లక్ష్మీ నరసయ్య ,కోనేటి పోచయ్య, గండికోట రవి తదితరులు పాల్గొన్నారు.