గ్రామపంచాయతి కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన  చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం

గ్రామపంచాయతి కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన   చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం

ముద్ర, బోయినిపల్లి:-రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో కార్మికుల ఆధ్వర్యంలో గత 27 రోజులుగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.గ్రామపంచాయతి సిబ్బందికి వేతనాల పెంపు,  పర్మినేంట్ చేయాలని మరియు కారోబార్, బిల్ కలెక్టర్లను పంచాయతి సహాయ కార్యదర్శిలుగా నియమించాలని చేస్తున్న మండల కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సంఘీభావం తెలిపిన చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కూస రవీందర్, బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగుల కనుకయ్య, మండల కాంగ్రెస్ నాయకులు బోయిని ఎల్లేష్, గంగిపెల్లి లచ్చయ్య, మహేందర్, ఒంటెల లక్ష్మారెడ్డి, ఎండీ రఫీ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు నాగుల వంశీ, నిమ్మ వినోద్ రెడ్డి, ఆకుల అజయ్, జాగిరి వెంకటేష్, క్రాంతి కిరణ్, నాగరాజు, నక్క శ్రీకాంత్, వంశీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు