హిందుత్వం విషయంలో నో కాంప్రమైజ్

హిందుత్వం విషయంలో నో కాంప్రమైజ్

- నా దారి రహదారి... బరాబర్ హిందుత్వం మాట్లాడతా

- ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు

- కేసీఆర్ ‘కరెంట్’ కట్ చేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారు

- మజ్లిస్ కు దమ్ముంటే అన్ని స్థానాల్లో పోటీ చేయాలి

- కాషాయ జెండా భగభగలకు పచ్చ జెండా మాడిమాసై పోవాల్సిందే

- తెలంగాణలో అప్పులన్నీ తీరి అభివ్రుద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే

- అమెరికాలో చిప్పలు కడిగేటోడికి వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి.

- చనకా కొరటా ప్రాజెక్టు నుండి కమీషన్లు వెళ్లాయే తప్ప చుక్క నీరెందుకు ఇవ్వలేదు?

- ఈ జిల్లా మంత్రి మిస్టర్ 40 పర్సంటేజ్ కమీషన్ల మినిస్టర్ గా మారిపోయాడు

- రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా స్పందించని సీఎం

- ప్రజల పక్షాన ఎంతకైనా తెగిస్తూ పోరాడుతోంది బీజేపీనే

- మేం అధికారంలోకొస్తే ఉచిత విద్య, వైద్యంతోపాటు పేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం

- పంట నష్టపోయిన రైతాంగానికి నష్ట పరిహారం అందిస్తాం

- ఆదిలాబాద్ జిల్లా సభలో కేసీఆర్ సర్కార్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్


- బండి సంజయ్ రాకతో ఆదిలాబాద్ జిల్లా కార్యకర్తల్లో జోష్

- ఆదిలాబాద్ బైపాస్ నుండి పట్టణం మీదుగా 13 కి.మీల మేరకు భారీ ర్యాలీ నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు

- బండి సంజయ్ సమక్షంలో భారీ ఎత్తున బీజేపీలో చేరిన జిల్లా నాయకులు

- అనంతరం మహిళలపై సాగుతున్న అత్యాచారాలకు నిరసనగా బీజేపీ కార్యకర్తలతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన బండి సంజయ్

‘హిందుత్వం విషయంలో నో కాంప్రమైజ్. నా దారి రహదారి...బరాబర్ హిందుత్వం గురించి మాట్లాడతా. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కుండ బద్దలు కొట్టారు. మజ్లిస్ నేతలకు దమ్ముంటే ఆదిలాబాద్ జిల్లా సహా తెలంగాణలోని  అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. కాషాయ జెండా భగభగలకు పచ్చ జెండా మాడిమాసై పోక తప్పదని హెచ్చరించారు. 

ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో బండి సంజయ్ పర్యటించారు. బండి సంజయ్ రాకతో కార్యకర్తల్లో పెద్ద ఎత్తున జోష్ నెలకొంది. వందలాది వాహనాలతో వేలాది మంది బండి సంజయ్ వెంట నడిచారు. దాదాపు 13 కి.మీల మేరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జనార్దన్ రెడ్డి గార్డెన్స్ లో జరిగిన సభలో టీఆర్ఎస్ సీనియర్ నేత రఘుపతికి కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతోపాటు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు దారట్ల జీవన్, దుర్గం రాజేశ్వర్, గంటా సంతోష్, శివ,  నాగేందర్, రాజు, సతీష్, కేశవ్ పటేల్, క్రాంతి పటేల్, మోహన్, జైపాల్, రామన్ రాజు, దశరథ్ సహా వందలాది మంది నాయకులు ఈరోజు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. 
 


• ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అధ్యక్షులు పాయల్ శంకర్, రమాదేవి, జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ సుహాసినీరెడ్డి, కంది శ్రీనివాసరెడ్డి  తదితరులు హాజరైన ఈ సమావేశంలో బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు...

• . ఈ సందర్భంగా ఆదిలాబాద్ కార్యకర్తలో ఫుల్ జోష్ కన్పిస్తోంది. నేను మిస్టర్ ఇండియా చూసిన... కానీ ఇక్కడ మిస్టర్ 40 శాతం కమిషన్ మంత్రిని చూస్తున్న. ఆదిలాబాద్ జిల్లాలో తాగడానికి నీళ్లు లేవు. సౌకర్యాల్లేవు. 

• వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాను అభివ్రుద్ధి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రిమ్స్ కు రూ.130 కోట్లు ఇస్తే.. స్టాఫ్ లేరు, సౌకర్యాల్లేకుండా చేస్తున్నారు. ఈ జిల్లా అభివ్రుద్ది చెందాలంటే రామరాజ్యం రావాలి. బీజేపీ అధికారంలోకి రావాలి.

• చనాకా – కొరటా ప్రాజెక్టు అంచనాలు పెంచి కమీషన్లు దోచుకుంటున్నరు. కానీ ఇక్కడి వాళ్లకు చుక్క నీరు రాలేదు. పిప్పల్ కోట బ్యారేజీ కోసం వెయ్యి ఎకరాలిచ్చిన రైతులకు నాలుగేళ్ల  క్రితం ఎకరాకు రూ.8 లక్షలలిస్తే... ఇప్పుడు రూ.7 లక్షలే ఇస్తానంటూ రైతుల ఉసురు తీసుకుంటున్నారు.

• ఇంటికో ఉద్యోగమన్నారు. ఒక్కరికీ ఉద్యోగమియ్యలే. నిరుద్యోగ భ్రుతి ఇస్తానన్నడు. ఒక్కరికీ ఇయ్యలే. మరేం చేయాలి. కేసీఆర్ సర్కార్ ను తీసుకుపోయి కుంటాలలో విసిరిపారేద్దాం.

• ఇక్కడికి వచ్చిన జనాన్ని చూసి బీఆర్ఎస్ నేతల మైండ్ బ్లాక్ అయ్యింది. మీరంతా కలిసి ఆ పార్టీని షేక్ చేయాలి. 

• నరేంద్రమోదీ ఈ ఏడాదిలోనే 10 లక్షల ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చింది. రోజ్ గార్ మేళా తో గత మూడు నెలల్లో 2.16 లక్షల ఉద్యోగాలను అపాయిట్ మెంట్లతో భర్తీ చేశారు. కానీ కేసీఆర్ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిండా?

• ఇక్కడ ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలే. ఆయన మాత్రం 100 రూముల ఇల్లు కట్టుకున్నడు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో నిలువనీడలేని పేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం. దీంతోపాటు ఉచిత విద్య, వైద్యం కూడా అందిస్తాం. అంతేగాదు పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమాకింద పంట నష్ట పరిహారం చెల్లిస్తాం.

• కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ కుటుంబం మాత్రం దోచుకుంటోంది. కేసీఆర్ బిడ్డ దొంగ సారా దందా, పత్తాల దందా చేస్తోంది. దేశమంతా కేసీఆర్ ను చూసి నవ్వుతోంది. ప్రజల కష్టాల పట్టని కేసీఆర్ రాత్రింబవళ్లు తాగడం తప్ప చేసిందేమీ లేదు. ఇచ్చిన హామీలైన రుణమాఫీ, డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వడానికి డబ్బుల్లేవన్నడు.. బిడ్డ దొంగ దందాలకు మాత్రం వందల కోట్ల పెట్టుబడి పెడుతున్నడు. దేశం నవ్వుతుంటే తెలంగాణ ప్రజలు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది.

• పోడు భూములకు పట్టాలిస్తానని హామీ ఇఛ్చి మోసం చేసిండు. కుర్చీ వేసుకుని కూర్చుంటానని చెప్పి మోసం చేశాడు.  ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాల్జేశారు. ఒక్కొక్కరి పేరిట రూ.1.20 లక్షల అప్పు భారం మోపిండు. తెలంగాణలో ఎట్లాగూ బీఆర్ఎస్ వచ్చే పరిస్థితి లేదు. పొరపాటున కేసీఆర్ గెలిస్తే ఒక్కొక్కరిపై రూ.5 లక్షల అప్పు భారం మోపుతారు.

• తెలంగాణలో అప్పులు తీరాలన్నా, ప్రజలకు న్యాయం జరగాలన్నా, రాష్ట్రం అభివ్రుద్ధి చెందాలన్నా బీజేపీ అధికారంలోక రావాల్సిందే.

• ఆదిలాబాద్ హిందుత్వ అడ్డ. లాలా రాజేశం టైగర్ హిందుత్వ శక్తి ఏందో చెప్పిండు. హిందువులు పండుగ చేసుకోవాలంటే గతంలో మాదిరిగా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. వినాయక ఉత్సవాలు జరపాలంటే పోలీసుల, అధికారుల పర్మిషన్ తీసుకోవాల్నా? ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు.

• ఎంఐఎం లీడర్లు మగోళ్లైతే, దమ్ముంటే ఆదిలాబాద్ జిల్లాలో పోటీ చేయ్... మీ సంగతి చూస్తాం. ఈ గడ్డమీద పచ్చ జెండాకు స్థానం లేదు. కాషాయ జెండా నుండి వచ్చే భగభగలకు నీ పచ్చ జెండా మాడిమాసై పోతది. ఈ గడ్డమీద ఎగిరేది కాషాయ జెండా మాత్రమే. 

• తెలంగాణలో 80 శాతమున్న హిందువుల గురించి మాట్లాడితే బండి సంజయ్ ను మతతత్వ వాదిగా చిత్రీకరిస్తున్నారు. నా దారి ఒకటే.. రహదారి. బరాబర్ 80 శాతం హిందువుల గురించి మాట్లాడి తీరుతా. 

• బీహార్,  మహారాష్ట్ర, గుజరాత్ లో ఎంఐఎం పార్టీ లేనేలేదు. కానీ 12 శాతం ఓట్లతో బీహార్ లో 5 సీట్లు గెలిస్తే... 80 శాతం హిందువులున్న తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు గెలవాలి? ఆలోచించండి.

• నేనెవరికీ భయపడను. కేసులు పెట్టినా, లాఠీ ఛార్జీ చేసినా, జైల్లో పెట్టినా మా కార్యకర్తల చేతుల్లో రెపరెపలాడేది కాషాయ జెండానే. ప్రజల పక్షాన కొట్లాడేది బీజేపీనే. పోడు భూముల సమస్యపై పోరాడింది. రైతుల పక్షాన లాఠీ దెబ్బలు తిన్నది, 317 జీవో పై ఉద్యోగుల పక్షాన కొట్లాడింది బీజేపీ పార్టీ మాత్రమే.

• రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ ను ఎదుర్కొనే ఏకైక పార్టీ బీజేపీయే. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నరు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు ఓటేశాం... ఈసారి బీజేపీకి అవకాశం ఇయ్యాలని ప్రజలంతా భావిస్తున్నారు. 

• 1983 నుండి నేటి వరకు రాష్ట్రంలో అధికార పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీలకు మాత్రమే ఓటేశారు. ఈసారి బీజేపీకి ఓటేయబోతున్నారు. బీఆర్ఎస్ మూసేసిన ఫైనాన్స్ దుకాణం. బార్ అండ్ రెస్టారెంట్ సమితిగా మారిపోయింది. నాందేడ్ పోయి ఛత్రపతి శివాజీ ఫోటో పెట్టుకుని సభ నిర్వహించిన కేసీఆర్ తెలంగాణలో మాత్రం శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేసే బీజేపీ కార్యకర్తలను లాఠీలతో కొట్టించిన మూర్ఖుడు.

• కేసీఆర్ సహా కాంగ్రెస్ నేతల నోటి నుండి హిందువులమని చెప్పిన ఘనత బీజేపీదే. కేసీఆర్ మళ్లొక్కసారి మిమ్ముల్ని మోసం చేసేందుకు కుట్ర చేస్తారు. జాగ్రత్త. కేసీఆర్ ఈ మధ్య కొత్త స్కాచ్ బాటిల్ తెప్పించి తన జాన్ జబ్బాగా ఉన్న పంజాబ్ సీఎంను పిలిచి దావత్ చేసుకున్నడు తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. 

• బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలుసహా అన్ని రకాల పెంచి ప్రజల నడ్డి విరుస్తుండు. 24 గంటల కరెంట్ ఇస్తున్నానని చెప్పి మోసం చేస్తున్నడు. నేను ఎక్కడికి వెళ్లినా కరెంట్ కట్ చేస్తున్నడు.. ఇట్లనే చేస్తే కేసీఆర్ కరెంట్ చేయడం తథ్యం. 

• కేసీఆర్ పాలనలో పేదల అల్లాడుతున్నరు. అమెరికాలో చిప్పలు కడుక్కునే కేసీఆర్ కొడుకు వేల కోట్లు ఎట్లా సంపాదించారు? ఇసుక, ల్యాండ్, డ్రగ్స్, లిక్కర్ దందాలతో బీఆర్ఎస్ నేతలు దోచుకుంటున్నారు.  ఈ జిల్లా మంత్రుల దోపిడీని తట్టుకోలేక ఆ పార్టీ నేతలంతా బీజేపీలో చేరుతున్నారు. జిల్లా మంత్రి మిస్టర్ 40 పర్సంటేజీ కమీషన్ల మినిస్టర్ గా మారిపోయిండు. 

• తెలంగాణలో జరుగుతున్న అభివ్రుద్ధి పనులకు కేంద్రమే నిధులిస్తోంది. వాటిపై కేసీఆర్ తన ఫోటోలు పెట్టుకుని ఊరేగుతున్నరు. మద్యం ద్వారా రూ.40 వేల కోట్లు సంపాదిస్తూ... రైతు భీమా, కళ్యాణ లక్ష్మీ, పెన్షన్ల కోసం 30 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నడు... 

• ఆదిలాబాద్ జిల్లా అభివ్రుద్ధి చెందాలంటే... సంక్షేమ పథకాలు అమలు కావాలంటే.. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే. అప్పుడే పేదలకు న్యాయం జరుగుతుంది. పొరపాటున పెద్దల రాజ్యం వస్తే అంతే సంగతులు. పేదలు గల్లా ఎగరేసుకుని తిరిగే పరిస్థితి రావాలంటే బీజేపీ రావాలి. 

• యువకులారా...ఈ ఆవేశాన్ని ఇంతటితో ఆపొద్దు. ఎన్నికల వరకు కొనసాగించండి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను పాతరేయండి. కేసీఆర్ అవినీతి, రజాకార్ల పాలనను తరిమికొట్టేందుకు బీజేపీ సాగిస్తున్న మహా సంగ్రామంలో భాగస్వాములు కండి. అందుకోసం ఎన్నికల వరకు మీరంతా మాకు టైమివ్వండి. గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడిద్దాం.


పాయల్ శంకర్ : ఆదిలాబాద్ జిల్లా అభివ్రుద్ధికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులిచ్చేందుకు సిద్ధమైనా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల ఆగిపోయాయి. జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తీరువల్ల రైల్వే లేన్, ఎయిర్ పోర్టు నిర్మాణం ఆగిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్మూర్ నుండి నిర్మల్ వరకు రైల్వే లేన్ ను ఏర్పాటు చేయాలి. ఎయిర్ పోర్ట్ ను నిర్మాణం చేయాలి. ఇల్లు లేక వేలాది మంది గోస పడుతున్నారు. వాళ్లందరికీ ఇండ్లు మంజూరు చేయాలి. పాత, కొత్త అనే తేడాలేకుండా మీ అందరినీ గుండెల్లో పెట్టుకుంటాం. జిల్లాలోని ఎమ్మెల్యే స్థానాలన్నింటినీ కైవసం చేసుకుంటాం. బీజేపీ నేతలపై ఒక్కొక్కరిపై 30, 40 కేసులు పెడుతున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక జోగు రామన్న సంగతి చూసుకుంటాం.

ఎంపీ సోయం బాపూరావు : మహారాష్ట్రతో పోలిస్తే లీటర్ కు రూ.10 లు ఎక్కువ వసూలు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం. అందుకే ఇక్కడి వాళ్లంతా మహారాష్ట్రపోయి పెట్రోల్, డీజిల్ పోసుకుని వస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడిస్తాం. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం.