మతోన్మాద కుట్రలను ప్రతిఘటిద్దాం

మతోన్మాద కుట్రలను ప్రతిఘటిద్దాం

ముద్ర,తంగళ్లపల్లి: కేంద్రబిజెపి ప్రభుత్వ మతోన్మాద,కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ  సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్ర పోస్టర్ ను సిపిఎం పార్టీ తంగళ్ళపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో టెక్స్ టైల్ పార్క్ లో ఆవిష్కరించారు.

ఈనెల 23న ఆదిలాబాద్ నుండి యాత్ర ప్రారంభమై 26వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సభ నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ తంగళ్ళపల్లి మండల కార్యదర్శి కోడం రమణ,మోర అజయ్, శ్రీరాముల రమేష్ చంద్ర,  కుడిక్యాల కనకయ్య,కూచన శంకర్,జెల్ల సదానందం,అక్కల శ్రీనివాస్,అడెపు శుభ శేఖర్, గడ్డం ఎల్లయ్య,శ్రీనివాస్, రంగయ్య,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.