ఆరోగ్యంగా ఉంటేనే సమర్థవంతంగా విధులు నిర్వహించగలుగుతాము- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ | Mudra News

ఆరోగ్యంగా ఉంటేనే సమర్థవంతంగా విధులు నిర్వహించగలుగుతాము- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ | Mudra News

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: నిరంతరం విధులు నిర్వహించే పోలీసులు నిత్యం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టుసాధించవచ్చని,నిత్యజీవితంలో యోగ ఒక అలవాటుగా మార్చుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందికి తెలియజేశారు.శుక్రవారం రోజున జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో  యోగా కార్యాక్రమాన్ని నిర్వహించి యోగా నిపుణులచే పోలీస్ సిబ్బందికి యోగాలో శిక్షణనిచ్చారు.

నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద వహించవద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు.పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ  ప్రత్యేక చొరవతో ఆర్.కె డయాగ్నోస్టిక్స్ వారి సౌజన్యతో జిల్లా పోలీస్  హెడ్ క్వార్టర్స్ లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది..

అందులో భాగంగా పోలీస్ అధికారులకు,సిబ్బందికి డయాబెటిస్, కార్డియక్ స్క్రీనింగ్,బ్లడ్ షుగర్, ఈ.సి.జి,ఫిజీషియన్ తదితర టెస్టులు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడు విధినిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు దినచర్య, జీవన విధానం మిగతావారితో పూర్తి భిన్నంగా ఉంటుందని, ఇందుకుగానూ మన ఆరోగ్య పరిరక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకొనక తప్పదని అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక, వ్యాయామం, యోగ వంటివి మన దినచర్యలో భాగం చేసుకోవాలని. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని అన్నారు. కొన్ని వ్యాధులకు గతంలో వైద్యం అందుబాటులో ఉండేది కాదని ప్రస్తుత సమాజంలో ఎంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో కలవని ప్రత్యేకంగా మనకు అందుబాటులో గల ఆరోగ్య భద్రత సద్వినియోగం చేసుకోవాలని 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు ప్రతి మూడు నెలలకు ఒకసారైనా మన ఆరోగ్యం కోసం డాక్టర్లను సంప్రదించి మందులు వాడే దానికంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని సూచించారు.

సిబ్బంది ఆరోగ్యం , సంక్షేమం పట్ల ఎస్పీ  తీసుకుంటున్న శ్రద్ధ విశేషమైనదని, ఉచిత మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేసినందుకు అధికారులు సిబ్బంది ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలిపినారు.

ఈ కార్యక్రమములో  అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్.ఐ లు కుమారస్వామి, రజినీకాంత్, యాదగిరి, సి.ఐ లు అనిల్ కుమార్, ఉపేందర్,నవీన్ కుమార్, ఎస్.ఐ లు ఆర్.ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.