బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
  • అభిమానులతో కలిసి కేక్ కట్ చేసిన రవీందర్ రావు
  • కోదురుపాకలో మొక్కలు నాటి రక్తదానం చేసి సంబరాలు చేసుకున్న అభిమానులు
  • శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు ప్రజా ప్రతినిధులు అధికారులు

ముద్ర బోయినిపల్లి; సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం.బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు జన్మదినం పురస్కరించుకొని కొదురుపాకలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. రవీందర్ రావు జన్మదినం సందర్భంగా కోధురుపాక ప్రభుత్వ పాటశాల ఆవరణలో మొక్కలు నాటారు.రైతు వేదికలో బిఆర్ఎస్వి మండల అధ్యక్షులు మాందాల వరుణ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా, దాదాపు 20 మంది వరకు రక్త దానం చేశారు.వీరికి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి  జోగినిపల్లి రవీందర్ రావు  ఎనర్జీ డ్రింకులు అందజేశారు. అనంతరం రైతు వేదిక వద్ద  అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. 
అనంతరం అన్నదాన కార్యక్రమంలో రవీందర్ రావు పాల్గొన్నారు.జన్మదిన సందర్భంగా బి.ఆర్.ఎస్ జిల్లా నాయకులు అనుముల భాస్కర్ రెడ్డి సోదరులు జన్మదిన పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పాటల సిడిని రవీందర్ రావు ఆవిష్కరించారు.అనుముల భాస్కర్ రెడ్డి సోదరులు గజమాల వేసి, ఖడ్గాన్ని బహుకరించారు.ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పిటిసి కత్తెరపాక ఉమా కొండయ్య, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, బి.ఆర్.ఎస్ జిల్లా నాయకులు అనుముల భాస్కర్ రెడ్డి, తహశీల్దార్ నరేష్, ఎంపీడీవో నల్ల రాజేందర్ రెడ్డి, ఎస్సై మహేందర్, గంగాధర ఎస్సై అభిలాష్ లతోపాటు పలువురు పూల బొకేలు ఇచ్చి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షులు కొనుకటి లచ్చిరెడ్డి,సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్,వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్  చిక్కాల సుధాకర్ రావు,చందుర్తి సెస్  డైరెక్టర్ అల్లాడి రమేష్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పూల బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.