రైతులు అదైర్య పడవద్దు అండగా ఉంటాం -పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే రమేష్ బాబు

రైతులు అదైర్య పడవద్దు అండగా ఉంటాం -పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే రమేష్ బాబు

 ముద్ర,రుద్రoగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి  మండల కేంద్రంలో 
రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు బుధవారం రోజున  క్షేత్రస్థాయిలో పరిశీలించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 4సంవత్సరాలుగా ఎల్లంపల్లి నీళ్ల ద్వారా, రైతుబంధు, రైతుభీమ ద్వారా, ఇప్పుడు ఇప్పుడే కుదుటపడుతున్న రైతుకు ఈ అకాల వర్షం తీవ్రనష్టం కలిగించింది. రైతులకు ఇది ఒక గొడ్డలి పెట్టుగా  పంట నష్టం అనేకంటే పంట ధ్వంసం అనే తీరుగా నష్టం జరిగిందని అన్నారు. రైతులు అదైర్య పడవద్దని మన ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని బరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జడ్పీటీసీ గట్ల మీణయ్య , సర్పంచ్లు, ఎం.పి.టి.సీలు, ప్రజా ప్రతినిధులు,అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.