రైతుల సమగ్రాభివృద్ధి కి ప్యాక్స్ కృషి అమోఘం 

రైతుల సమగ్రాభివృద్ధి కి ప్యాక్స్ కృషి అమోఘం 
  • సిరిసిల్ల ప్యాక్స్ ఛైర్మన్ బండి దేవదాస్ గౌడ్

ముద్ర,తంగళ్లపల్లి:-సిరిసిల్ల ఫ్యాక్స్ కార్యాలయంలో అధ్యక్షులు బండి దేవదాస్  గౌడ్ అధ్యక్షతన మహాజన సభ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతుల సమగ్రాభివృద్ది కోసం సొసైటీ తరపున తమవంతు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు.సీఎం కేసీఅర్,మంత్రి కేటీఆర్ బాటలో పయనిస్తూ రైతుల సమగ్రాభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నట్లు పీఏసీఎస్ సంఘా సభ్యులు, ప్రజాప్రతినిధుల వెల్లడించారు.


సొసైటీకి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు కొండూరు రవీందర్ రావు కి ఈ సమావేశంలో సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సమావేశంలో సొసైటీ ద్వారా రైతు సోదరులకు అందిస్తున్న సేవలు వివరించిన సభ్యులు రుణాల మంజూరు,రికవరీ, సంఘ అభివృద్ధిపై చర్చించారు.కేడీసీసీ బ్యాంకు ద్వారా, సొసైటీ ద్వారా అందుబాటులో ఉన్న కార్యక్రమాలు వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ పడిగల మానస రాజు,ప్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి,ప్యాక్స్ డైరెక్టర్లు వేన్నమనేని శ్రీదర్ రావు,బండి దేవేందర్ యాదవ్, గడిల సురేష్,సత్తు వెంకట్ రెడ్డి,  గన్యా నాయక్,మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వలకొండ వేణుగోపాల్ రావు, మండేపల్లి సర్పంచ్ శివజ్యోతి, చీర్లవంచ సర్పంచ్ రవీందర్, రామన్న పల్లె సర్పంచ్ రంగయ్య,మండల బీఆర్ఎస్ అద్యక్షుడు రాజన్న,నాయకులు,రైతులు పాల్గొన్నారు.