ప్రమాద బాధితునికి అండగా మంత్రి కేటీఆర్

ప్రమాద బాధితునికి అండగా మంత్రి కేటీఆర్

సిరిసిల్ల టౌన్, ముద్ర: సిరిసిల్ల పట్టణం లోని నెహ్రూనగర్ కి చెందిన కొండ అఖిల్ కి గత నెల 20 వ తేదీన కరీంనగర్- సిరిసిల్ల ప్రధాన రహదారి పై బైక్ పై వెళ్తుండగా ప్రమాదం జరిగి తలకి తీవ్ర గాయాలు అయ్యాయి. అత్యవసర పరిస్థితులలో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తలకి తీవ్ర గాయాలు అవ్వడంతో కోమాలోకి వెళ్లిన అఖిల్ తలకి సర్జరీ అనంతరం దాదాపు 15 రోజుల తర్వాత ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు. నిమ్స్ హాస్పిటల్ లో రూ. 4 లక్ష ల వరకు ఖర్చు కాగా నిస్సహాయ స్థితిలో అఖిల్ కుటుంబ సభ్యులు స్థానిక కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ కి ప్రమాద వివరాలు తెలుపగా అన్నారం శ్రీనివాస్ హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించి మంత్రి కేటీఆర్ కి ఫోన్ లో అఖిల్ యొక్క ఆరోగ్య పరిస్థితి మరియు హాస్పిటల్ ఖర్చు వివరాలు తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ నిమ్స్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి ఎటువంటి ఖర్చు లేకుండా అఖిల్ డిశ్చార్జ్ అయ్యేందుకు కృషి చేశారు. పెద్ద మనసుతో సహాయం చేసిన మంత్రి కేటీఆర్ కి జీవితాంతం రుణపడి ఉంటామని, అలాగే తమ వెంటే ఉండి, తమ పరిస్థితిని అర్థం చేసుకొని మంత్రి కేటీఆర్ సహాయంతో ఎటువంటి ఖర్చు లేకుండా డిశ్చార్జ్ అయ్యేందుకు కృషి చేసిన కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ కి కొండ అఖిల్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.