సిరిసిల్లాలో బిజెపి నేతల రాస్తారోకో... పేపర్ లీకేజీకి నిరసనగా ధర్నా

సిరిసిల్లాలో బిజెపి నేతల రాస్తారోకో... పేపర్ లీకేజీకి నిరసనగా ధర్నా

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బిజెపి నాయకులు పేపర్ లీకేజీ కి నిరసనగా రాస్తారోకో ధర్నా నిర్వహించారు. మంత్రి కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని బిజెపి నాయకులు లగిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. బిజెపి నాయకుల ఆందోళనతో రాకపోకలు ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. పోలీసులు పలువురు అరెస్ట్ చేసి ఠానాకు తరలించారు.