కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ
![కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_64098ff9d1443.jpg)
ముద్ర కోనరావుపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ అన్నారు గురువారం మండలం కనగర్తి గ్రామంలో కంటి వెలుగు పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం చైర్ పర్సన్ కంటి పరీక్షలు చేసుకున్నారుఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ అందరహిత సమాజం నిర్మాణం కోసమే ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర రావు కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలను ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో, నిర్వహించి వారికి మందులను కళ్ల అద్దాలను అందజేస్తున్నామన్నారు. ప్రజలు ఎవరు కూడా కంటి సమస్యలతో బాధపడవద్దనే ముఖ్య లక్ష్యంతో కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్ సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ సర్పంచ్ భారతి పాక్స్ చైర్మన్ బండ నర్సయ్య ఎంపీడీవో రామ కృష్ణ ఎంపిటిసి లక్ష్మి మండల వైద్యాధికారివేణు మాధవ్ సూపర్ వైజర్ శ్రీ దేవి వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.