39వ వార్డ్ లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్

39వ వార్డ్ లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్

ముద్ర సిరిసిల్ల టౌన్; రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని 39 వ వార్డ్ లో స్థానిక కౌన్సిలర్ ఆకుల కృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంను మున్సిపల్ చైర్ పర్సన్  జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథులుగా పాల్గొని  ప్రారంభించారు. కౌన్సిలర్ ఆకుల కృష్ణ మాట్లాడుతు 39 వ వార్డ్ లో ఈరోజు నుండి వరుసగా  7 రోజులపాటు ఇట్టి కంటి వెలుగు శిబిరాన్ని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడునని ప్రజలందరూ ఇట్టి కంటి వెలుగు కార్యక్రమం ద్వారా వారి యొక్క కంటి సమస్యలను పరిష్కరించుకునేలా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు ఏనుగుల అంజమ్మ ఎల్లయ్య, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.