దారి తప్పి జనావసలోకి వచ్చిన నక్క..

దారి తప్పి జనావసలోకి వచ్చిన నక్క..

ముద్ర,రుద్రoగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండల కేంద్రానికి చెందిన దరిపెళ్లి మహేష్ అనే వ్యక్తి ఇంట్లోకి అటవీ నక్క రావడంతో మహేష్ వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు వచ్చి నక్కను బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ చుట్టూ అటవీప్రాంతం ఉన్నందున అటవీ జంతువులు దారితప్పి జనావాసాల్లోకి, ఇండ్లల్లోకి వస్తుంటాయని అలాంటి సమయంలో ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అటవీ జంతువులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. రిస్క్ చేసి నక్కను పట్టుకున్న వారిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బాలకృష్ణ, సిబ్బంది శంకర్, రాజు, ఉన్నారు..