డే కేర్ సెంటర్ లో చేర్పించి నూతన వస్త్రాలు అందించిన ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ 

డే కేర్ సెంటర్ లో చేర్పించి నూతన వస్త్రాలు అందించిన ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ 

ముద్ర, ఎల్లారెడ్డిపేట: ఇటీవల గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో గల బస్ స్టాండ్ లో తలదాచుకుంటున్న కొత్తపల్లి కి చెందిన వేదాంతి పద్మా వతి(99)వేదాంతి గోపాల చారి (70) ల పరిస్థితి తెలుసుకుని ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ గంభీరావుపేట ఎస్ ఐ మహేష్ లు కలిసి ఎల్లారెడ్డి పేట లో గల డే కేర్ సెంటర్ కు తరలించారు.కాగ గోపాల చారి  కట్టు బట్టలతో ఉంటున్నామని వాటితో కాలం వెళ్లదీస్తూన్నామని ఇంటికి వచ్చి చెప్పగా ఉపసర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజు యాదవ్,తన కూతురు ఒగ్గు శ్రీనిధి యాదవ్ లు పద్మావతి, గోపాలచారిలకు నూతన వస్త్రాలు అందించారు.తన తల్లి గారి గ్రామం కొత్త పల్లి కి చెందిన పురోహిత కుటుంభానికి ఇంతటి కష్టం రావడం బాధ గా ఉందని ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు.ప్రతి నెల మందులు వాడుతున్నమని చెప్పగా మందులను ఇప్పిస్తామని గోపాల చారి కి బరోసా ఇచ్చారు.