ఏఎంసీ చైర్మన్ ఎలుసాని కి సన్మానం
- ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో
ముద్ర, ఎల్లారెడ్దిపేట :ఏఎంసి నూతన చైర్మన్ ఎలుసాని మోహన్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన ఎల్సాని మోహన్ కుమార్ ను ఆదివారం రాచర్ల బొప్పాపూర్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో పుష్పగుచ్చమిచ్చి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా బొప్పాపూర్ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి మాట్లాడుతూ తమ గ్రామంలో వరి ధాన్యం రైతులు ఎక్కువగా పండిస్తారని ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసే విధంగా కృషి చేయాలని సూచించారు. రైతులకు అందుబాటులో ఉండి వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఎలుసాని మోహన్ కుమార్ కు ఏఎంసీ చైర్మన్ గా నియమించిన మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. నూతన డైరెక్టర్ బొమ్మనవేణి సత్యం, లయన్స్ క్లబ్ సభ్యులు వంగల రవీందర్, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.