కబ్జాకు కరెంట్ షాక్

కబ్జాకు కరెంట్ షాక్
  • రంగం చెరువు కబ్జాకు గురైన భూమిలో విద్యుత్ స్తంభాల నిలిపివేత 
  • అడ్డుకున్న అల్మాస్పూర్ గ్రామస్తులు

ముద్ర,ఎల్లారెడ్డిపేట: కబ్జాకు కరెంటు షాక్ తగిలింది. రంగం చెరువు కబ్జాకు గురి అయిన శిఖం భూమిలో విద్యుత్ స్తంభాలు నెలకొల్పడానికి వచ్చిన సిబ్బందిని అల్మాస్ పూర్ గ్రామస్తులు శనివారం అడ్డుకున్నారు. వెంకట్రావు దగ్గర సుమారు 45 ఎకరాల భూమి కొనుగోలు చేసిన గోవర్ధన్ గౌడ్ చదును చేసే క్రమంలో రంగం చెరువు భూకబ్జాకు గురైందని చెరువుకు ఉన్న కెనాల్ ను మట్టి తోటి కప్పి వేసి కబ్జా చేసిండని అల్మాస్పూర్ గ్రామస్తులు ఆరోపిస్తూ తీవ్ర ఆందోళన చేశారు. దీనిని అవకాశంగా తీసుకున్న ప్రతిపక్షాలు రంగం చెరువును సందర్శించారు. కబ్జాకు గురైన రంగం చెరువును కాపాడి తీరుతామని అల్మాస్పూర్ గ్రామస్తుల పక్షాన పోరాటం చేస్తామని వివిధ పార్టీ నాయకులు ప్రకటించారు.