రోడ్డు ప్రమాదంలో సుతార్ మేస్త్రి మృతి

రోడ్డు ప్రమాదంలో సుతార్ మేస్త్రి మృతి

హుజూర్ నగర్, ముద్ర: హుజూర్నగర్ పట్టణంలోని గోవిందపురం గ్రామానికి చెందిన సుతార్ మేస్త్రి కందుల గోపయ్య (40) గత నెల 21న తన స్కూటీపై మట్టపల్లి గ్రామానికి సుతార్ పని నిమిత్తం వెళ్లి తిరిగి రాత్రి 9:30 గంటల సమయంలో ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో ఎర్రగడ్డ గ్రామం వద్ద గేదెలు అడ్డురాగా వాటిని తప్పించబోయి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు.తలకు బలమైన గాయాలు కాగా చికిత్స కొరకు ఖమ్మంలోని మమత హాస్పిటల్ లో చికిత్స జరగగా ఈనెల 5న  సోమవారం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. అదే రోజు రాత్రి 8:30 సమయంలో తీవ్ర అస్వస్థతకు గురికాగా వెంటనే చికిత్స నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే మరణించాడని భార్య దేవమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.