జాతీయ పక్షికి అంత్యక్రియలు
- ప్రమాదవశాత్తు షాట్ సర్క్యూట్ తో నెమలి మృత్యువాత
ముద్ర, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం స్థానిక సాయిబాబ దేవాలయ ఆవరణలో ఆదివారం జాతీయ పక్షి నెమలి ప్రమాదవశాత్తు షాట్ సర్క్యూట్ తో మృత్యువాత పడగా సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు మృతిచెందిన నెమలికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో నెమలి మృతి చెందడంతో ఆలయానికి అపశృతి జరిగినట్లు పలువురు భావిస్తున్నారు.