భారీ వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం

భారీ వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం

- లబోదిబో మంటున్న అన్నదాతలు
ముద్ర, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం మండల కేంద్రంతో పాటు రాగట్టపల్లి,హరిదాసు నగర్, వెంకటాపూర్, ధూమల,అల్మాస్పూర్ గ్రామాలలో ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో కూతకొచ్చిన వరి ధాన్యం నేలమట్టం కాగా మండల కేంద్రంలో ఐకెపి సెంటర్ లో ఏర్పాటు చేసిన ధాన్యం కుప్పలు వరద నీటిలో  కొట్టుకుపోయాయి. ఆరుగాలం పండించిన పంట నీట మునగడంతో అన్నదాతలు  అర్ధనాదాలు పెట్టుకుంటున్నారు. పక్షం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పండించిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టడం కుప్పలుగా పోయడం చేస్తు ఇదే పనిలో నిమగ్నమయ్యారు.