పురుగుల మందు తాగి వృద్ధుల ఆత్మహత్య

పురుగుల మందు తాగి వృద్ధుల ఆత్మహత్య

 ముద్ర,చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లోని ఆసిరెడ్డి పల్లె గ్రామంలో భార్య భర్తలు వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక ప్రజలు తెలిపిన కథనం ప్రకారం వృద్ధులు గత సంవత్సరం నుండి కొడుకులు ,కోడల్లతో ఆస్తి తగాదాల వల్ల గొడవలు జరుగుతున్నాయని అలాగే పెద్దకొడుకు కోడలు ఇంటిలో ఉన్న కుల దైవాన్ని తీసుకుని ఇంటి నుండి బయటకు తీసుకు వెళ్తున్నాము అని అనడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు చెప్తున్నారు.

విషయం తెలుసుకున్న చందుర్తి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించగా రాత్రి సమయంలో కనికారపు దేవయ్య, భార్య లక్ష్మీ నర్సవ్వ వీరిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్తున్నారు. ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లోని దైవాన్ని బయటకు తీసుకు రావడానికి కుటుంబ సభ్యులతో వెళ్ళిన ఒగ్గు వాళ్ళు ఇంటి తలుపులు తట్టడంతో ఇంట్లో ఉన్నవారు తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి ఇంటి పైకి ఎక్కి చూశారని అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నట్లు తెలిపారు. స్థానిక ఎస్సై సిరిసిల్ల అశోక్ కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఏరియా ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు.