రాజీవ్కు ఘన వివాళి
![రాజీవ్కు ఘన వివాళి](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64e20d0b9fccd.jpg)
ముద్ర ప్రతినిధి, జనగామ: మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను జనగామ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు జనగామ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాజీవ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జనగామ మున్సిపల్ మాజీ చైర్మన్ వేమళ్ల సత్యనారాయణరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి సుధాకర్ గౌడ్, సర్వల నర్సింగారావు, జనగామ జిల్లా నాయకులు జిల్లెల్ల సిద్దారెడ్డి,
ఉడత రవి యాదవ్, మేడ శ్రీనివాస్, శివరాజ్ యాదవ్, మాజీ ఎంపీపీ ధర్మ గోవర్దన్ రెడ్డి, అల్లం ప్రదీప్ రెడ్డి, వీరారెడ్డి దామోదర్ రెడ్డి, మోటే శ్రీనివాస్, ఆలేటి సిద్ది రాములు, లింగాల నర్సిరెడ్డి, బొట్ల నర్సింగరావు, నూకల బాల్ రెడ్డి, జీవన్ రెడ్డి, పిట్టల సతీష్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్లో పండ్ల పంపిణీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు ఆయన వర్గీయులు జనగామ జిల్లా ఆస్పత్రిలో పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ధర్మపురి శ్రీనివాస్, పిన్నింటి నారాయణరెడ్డి, చితకింది మల్లేష్, లోక్కుంట్ల ప్రవీణ్, ఎం.డి మాజిద్, జఫర్ షరీఫ్, కాముని జయ, బాల్నే నరేష్, సుల్తాన్ గోవింద్ రెడ్డి, పిట్టల రాజు తదితరులు పాల్గొన్నారు.