బిగ్ బ్రేకింగ్ న్యూస్ - కాంగ్రెస్లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
![బిగ్ బ్రేకింగ్ న్యూస్ - కాంగ్రెస్లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే](https://mudranews.in/uploads/images/2024/06/image_750x_667e8b59ecebb.jpg)
బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. దిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, తెలంగాణ మాజీ స్పీకర్, భారాస బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. దీంతో యాదయ్యతో కలిపి ఇప్పటివరకు ఆరుగురు భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు.