కొండగట్టు కింద మరో చోరీకి పాల్పడ్డ దొంగలు...

కొండగట్టు కింద మరో చోరీకి పాల్పడ్డ దొంగలు...
  • అర్ధరాత్రి రెండు వైన్స్ ల్లో చోరీకి యత్నించి, విఫలం..

ముద్ర, మల్యాల: మండలంలోని కొండగట్టు ప్రాంతంలో గల శ్రీ సాయి శ్రీనివాస వైన్స్ లో శుక్రవారం అర్ధరాత్రి చోరీకి యత్నించిన ఇద్దరు దొంగలు విఫలం కావడంతో.. సమీపంలోని మరొక వైన్స్(సిరి)లో ప్రయత్నించారు. వెంటనే  సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగానే, దొంగలు వెంట తెచ్చుకున్న బైక్ వదిలేసి పరారయ్యారు.

చోరీకి సంబందించిన దృశ్యాలు అక్కడి సీసీ పుటేజ్ లలో రికార్డ్ అయినట్లు ఎస్ ఐ చిరంజీవి తెలిపారు. కేస్ నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు.. సీసీ పుటేజ్ లో లభ్యమైన దొంగల ఆచూకీ తెలిసినవారు వెంటనే మల్యాల పోలీస్ స్టేషన్ కి  సమాచారాం అందిస్తే , వారికి తగిన పారితోషికం కూడా అందజేయనున్నట్లు ఎస్ ఐ పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా, కొండగట్టు పైన, కింద వరుస చోరీలు కలవరపెడుతున్నాయి.. పోలీసులకు చోరీ ఘటనలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి... ఏది ఏమైనా దొంగలు కొండగట్టును టార్గెట్ చేయడంపై స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.