బీఆర్ఎస్ పై ఛార్జీషీట్..!
![బీఆర్ఎస్ పై ఛార్జీషీట్..!](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_6502cbf42a73e.jpg)
- గాంధీభవన్ లో సమావేశమైన కమిటీ
ముద్ర, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ చార్జిషీట్ కమిటీ సమావేశం గురువారం గాంధీభవన్ లో జరిగింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోన్న కాంగ్రెస్ పార్టీ.. గత తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ అమలుచేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై చార్జీషీట్ వేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. ధరణితో పాటు, ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్ భూముల విక్రయాలు, స్వాధీనంపై ఇప్పటికే పలుమార్లు ప్రెస్ మీట్లు నిర్వహించిన టీపీసీసీ నేతలు వాటిపై ఛార్జీషీట్ వేయాలని భావిస్తున్నారు. కమిటీ చైర్మన్ సంపత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీనియర్ నాయకులు కోదండరెడ్డి, రాములునాయక్, బెల్లయ్యనాయక్, ప్రీతమ్, నూతి శ్రీకాంత్, సోహైల్ పాల్గొన్నారు.