బీఆర్ఎస్ పై ఛార్జీషీట్..!

బీఆర్ఎస్ పై ఛార్జీషీట్..!
  • గాంధీభవన్​ లో సమావేశమైన కమిటీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ చార్జిషీట్ కమిటీ సమావేశం గురువారం గాంధీభవన్ లో జరిగింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోన్న కాంగ్రెస్ పార్టీ.. గత తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్​ అమలుచేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై చార్జీషీట్​ వేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. ధరణితో పాటు, ప్రభుత్వ, అసైన్డ్​, భూదాన్​ భూముల విక్రయాలు, స్వాధీనంపై ఇప్పటికే పలుమార్లు ప్రెస్​ మీట్లు నిర్వహించిన టీపీసీసీ నేతలు వాటిపై ఛార్జీషీట్​ వేయాలని భావిస్తున్నారు. కమిటీ చైర్మన్ సంపత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీనియర్ నాయకులు కోదండరెడ్డి, రాములునాయక్, బెల్లయ్యనాయక్, ప్రీతమ్, నూతి శ్రీకాంత్, సోహైల్ పాల్గొన్నారు.