బాబుతో ములాఖత్​..!

 బాబుతో ములాఖత్​..!
  • రాజమండ్రి జైళ్లో కలిసి పవన్​, బాలకృష్ణ, లోకేశ్​

ముద్ర, తెలంగాణ బ్యూరో : స్కిల్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంటల్ర్ జైలు లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం ములాఖత్​ అయ్యారు. కేసుకు సంబంధించిన వివరాలతో పాటు జైళ్లో చంద్రబాబు కోసం ఏర్పాటు చేసిన సదుపాయాల గురించి ఆయన్ను అడిగి తెలుసుకున్నారు. ములాఖత్ కు జైలు అధికారులు సుమారు 40నిమిషాల పాటు అనుమతి ఇచ్చారు. కీలక నేతల పరామర్శ నేపథ్యంలో జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ   ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ రాజమండ్రి జైలుకు కిలో మీటర్ దూరంలో ఏర్పాటు చేసిన క్యాంపులో బస చేస్తున్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని పరామర్శించనున్నారు. అయితే.. బాబుతో భేటీ తర్వాత పవన్, బాలకృష్ణ మీడియాతో మాట్లాడనున్నారు. కాగా, చంద్రబాబును పవన్, బాలకృష్ణ, లోకేష్‌లు కలవడం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. ఈ సందర్భంగా ఏ అంశాలు చర్చించనున్నారానేది ఉత్కంఠ రేపుతోంది. జనసేన, టీడీపీ పొత్తులపై ఏదైనా ప్రకటన ఉంటుందా?, తాజా రాజకీయ పరిణామాలపైనే చర్చలు పరిమితం అవుతాయా? ఉమ్మడి కార్యచరణ ఏమైనా ఉంటుందా? అనే చర్చ సాగుతుంది.