అర్హులైన వారికే దళిత బంధు, గృహలక్ష్మి పథకాలు అందించాలి

అర్హులైన వారికే దళిత బంధు, గృహలక్ష్మి పథకాలు అందించాలి
  • కాకర్లపల్లి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ 

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:- అర్హులైన వారికే దళిత బంధు గృహ లక్ష్మీ పథకాలు వర్తింప చేయాలని మంథని మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన దళితులు బుధవారం నిరసన తెలియజేశారు. అర్హులైన నిరు పేదలకు దళిత బందు, గృహలక్ష్మి పథకాలు ఇవ్వాలని గ్రామంలోని దళితవాడలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మాట్లాడుతూ కాకర్లపల్లి గ్రామంలో నివసిస్తున్న ప్రజలు ఇప్పటికీ పేదరికంలో ఉన్నారని అన్నారు. మంథని కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దళితులు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వమిచ్చిన దళిత బంధు, గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికలో అవినీతి అక్రమాలు జరిగాయని ఈ గ్రామానికి తక్కువ యూనిట్లు కేటాయించి కాకర్లపల్లి గ్రామానికి ఈ ప్రాంత పాలకులు అన్యాయం చేశారని అన్నారు. బిఆరెస్ నాయకులకు కండువా కప్పుకున్న  నాయకులకు తొత్తులుగా ఉండే వాళ్లకు మాత్రమే ఈ పథకాలు వచ్చాయని నిరుపేదల నోట్ల మట్టి కొట్టారని విమర్శించారు. ఇండ్లు ఉన్న వారికే గృహలక్ష్మి ఇచ్చి ఇండ్లు లేని పేదలకు అన్యాయం చేశారని అవేదన వ్యక్తం చేశారు. మంథని నియోజకవర్గంలో లబ్ధిదారులు ఎంపిక అధికారులు కాకుండా బీఆర్ఎస్ నాయకులు ఎంపిక చేస్తూ పేద ప్రజానీకానికి అన్యాయం చేస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని అన్నారు. అలాగే దళితవాడలో రెండు నెలలుగా వీధిలైట్ లేక దళితులు చీకటిమయంలో మగ్గుతున్నారని కనీసం వీధిలైటు పెట్టకపోవడం సిగ్గుచేటని అర్హులైన వారికి పథకాలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంథని వెంకటి, గట్టయ్య, శంకర్, మంథని సాగర్, మంథని సమ్మయ్య, బూడిద శంకర్, బోసెల్లి మౌనిక, రాజమ్మ, శంకరమ్మ, హేమలత తదితరులు పాల్గొన్నారు.